padyam-hrudyam

kavitvam

Thursday, September 28, 2017

దేవీ మహిమ్న స్తోత్రమ్ - 7



శ్రీ దూర్వాస మహర్షి విరచిత దేవీ (త్రిపురా) మహిమ్న స్తోత్రము నుండి:
వివరణ - బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు

***

జాతీ చంపక కుంద కేసర రజో గంధోత్కిరత్కేతకీ
నీపాశోకశిరీష ముఖ్య కుసుమై ప్రోత్తంసితా ధూపితా
ఆనీలాంజన నీల మత్త మధుపశ్రేణీ ప్రవేణీ తవ
శ్రీమాత శ్శ్రయతాం మదీయ హృదయామ్భోజం సరోజాలయే.

***

సంపెంగ, మొల్ల, సుగంధభరితమైన పుప్పొడులను వెదజల్లు మొగలి, కడిమి, అశోకము, శిరీషము మొదలైన దివ్యమైన పుష్పములతో అలంకరింపబడి అగరు ధూపములు వేయబడిన (చంపకాశోకపున్నాగసౌగంధిక లసత్కచా ...లలితాసహస్రము) కాటుక వలె నల్లనైన, మదించిన తుమ్మెదల బారు వలె యొప్పుతున్న నీ సర్పాకారపు జడ ఓ శ్రీమాతా! పద్మాలయా! నా హృదయపద్మంలో ఎల్లపుడూ ధరించబడు గాక. (అమ్మవారి కేశపాశములను ధ్యానించేవారికి మృత్యుభయం ఉండదని ఆదిశంకరాచార్యుల వారి వాక్కు.)

***

సంపెగ, మొల్ల, పుప్పొడుల జల్లెడి కేతకియు న్నశోకముల్
యింపగు మంకెనల్ సుమ కళింగము బోలు సుగంధ పుష్పముల్
సొంపుగ గూర్చి, ధూపముల జూపగ కాటుక బోలి, తుమ్మెదల్
గుంపుగ జేరినట్లుగను గొప్పగ భాసిలుచుండు  నీదు నీ
లంపు ప్రవేణి యో సరసిజాలయ నా యెద తమ్మి నిల్చుతన్.గ, 

No comments: