padyam-hrudyam

kavitvam

Tuesday, October 30, 2012

పశ్చిమాద్రి కడ గాయత్రీ!





రవి పూర్ణేంద్రుల పైని నింద్ర ధనువై రాజిల్లెనేమో యనన్
నవరత్నోజ్జ్వల కింకిణీ కలిత వీణన్ వాణి పాణిన్ ధరిం-
చి విరించ్యుక్తుల నాలపింప చిగురించెన్ తా నభోవల్లి సాం-
ధ్య విశేషంబన పశ్చిమాద్రి కడ గాయత్రీ! త్రి సంధ్యా సతీ!

ఈ పద్యం కీర్తి శేషులు యడవల్లి పూర్ణయ్య సిద్ధాంతి గారు రచించిన శ్రీ గాయత్రీ శతకం లోని నాల్గవ పద్యం.

సూర్య చంద్ర బింబములపై ఇంద్ర ధనుస్సు నతికినారా యన్నట్లు వాణి నవరత్న వీణను పట్టుకొని సామగానాలాపనము చేయగా ఆకాశ లత పడమటి దిక్కున సంధ్యారాగమను నెపముతో చిగురు తొడిగిందా
అన్నట్లు గా ఉంది అన్నది ఈ పద్యంలోని సుందరమైన భావం.

No comments: