padyam-hrudyam

kavitvam

Sunday, October 28, 2012

సరసాహ్లాదిని

పాలు, పెరుగు, చల్ల, వెన్న - ఈ పదాల నుపయోగించి భారతార్థంలో పద్యం వ్రాయాలి.
                                          అయితే పై పదాలను వాటి సహజార్థంలో వాడకూడదు.


పెరుగుట కక్షలెవ్వరికి పెంపొనరించును? కౌరవేశ! నీ
వెరుగవె ధర్మజాదులకు వేగమె పాలిడి జేరదీయవే,
కురియుచు చల్లగా మమత కూర్మిని,  వెన్నుని మాట చొప్పునన్!
కరుగవె సంపదల్ జరుగ కయ్యము? సాక్షిగ నుందు వెన్నగన్ .

No comments: