padyam-hrudyam

kavitvam

Saturday, October 13, 2012

సరసాహ్లాదిని

దుగ్ధము, దగ్ధము, ముగ్ధము, దిగ్ధము   ఈ నాలుగు పదాలను పాదాదిలో ఉంచి
 కృష్ణుని పై వృత్తం వ్రాయాలి:

ఉత్పలమాల:

దుగ్ధము  లాను బాల్యమున ద్రుంచెను పూతన !  గోపికాళికిన్ 
దగ్ధము జేసె మోహమును తానయి సర్వము ! స్పర్శమాత్రచే 
ముగ్ధ మనోహరాంగి యగు మూర్తిగ మల్చెను కుబ్జ !  శౌరి! సం-
దిగ్ధము బాపి యర్జునుని దిద్దెను పోరున గీత వాక్కులన్ !

No comments: