padyam-hrudyam

kavitvam

Saturday, November 24, 2012

నీకు నైవేద్య మిడకుంటి నీలకంఠ................




ఆది గురవే నమః.

పెరుగు తేనెను నెయ్యయు బెల్లములను
పాల నభిషేక మొనరింప జాలనైతి
చందనము పూయలేనైతి చల్లగాను
స్వర్ణ పుష్పాలు ధూపదీపాలు  లేవు.

వివిధ భక్ష్యమ్ములను దెచ్చి విరివిగాను
నీకు నైవేద్య మిడకుంటి నీలకంఠ !
నన్ను క్షమియించు శంకరా! నతులు నీకు
తప్పు మన్నించు కాపాడు  దండము లివె.

No comments: