padyam-hrudyam

kavitvam

Wednesday, March 27, 2013

వసంతోత్సవ వేళ.............

 



ప్రకృతి క్రొంజీరకై పలవరించుట జూచి
............శిశిరమ్ము సెలవని చెప్పు వేళ !
తరువులన్నియు రాల్చి దళముల,  క్రొన్ననల్
...........ధరియింప సమకట్టి మురియు వేళ !
నిశలు కృశింపగా నిబ్బరమ్ముగ పవల్
...........వెచ్చదనమ్ము తా నిచ్చు వేళ !
గోపీ సమేతుడై గోవర్ధనోద్ధారి
..........యమునా తటిని క్రీడ లాడు వేళ !

మించ వేడుక లానంద మెల్ల ధాత్రి
రంగు జలముల జల్లుక హంగు గాను
కూర్మి జనములు ప్రకటించు గొప్ప వేళ !
స్వాగతమ్మన రారె వాసంతునకును.


No comments: