padyam-hrudyam

kavitvam

Thursday, March 14, 2013

సరసాహ్లాదిని

దత్తపది: 

చరణము, భరణము, వరణము, తరుణము  -  ఈ పదాలనుపయోగించి భారాతార్థంలో
పద్యం వ్రాయాలి.

నా పద్యం:

రాజసూయ యాగం సందర్భంలో అగ్రపూజకు శ్రీకృష్ణుడే తగిన వాడని భీష్మ పితామహుడు పల్కిన పలుకులు:


చరణము పాప భంజనికి జన్మము నిచ్చిన చోటు! కౌస్తుభా-
భరణము నీడ యా కమల వాసిని కింపగు తావు! కుక్షి యా-
వరణము సర్వ సృష్టికిని!  వందిత వేదుని, గృష్ణు తొల్త నీ
తరుణము  నందు గొల్చుటలు ధర్మము నీకగు ధర్మ నందనా!

No comments: