padyam-hrudyam

kavitvam

Saturday, September 22, 2012

సరసాహ్లాదిని

సమస్య:
దుర్విన యంబునన్ మనసు దోచెడి వారు హితైషులే కదా.

పూరణ:
ఓర్వగ లేక సోదరుల యోర్మిని కూర్మిని మెచ్చలేక తా
నేర్వక ధర్మబుద్ధి కురునేత సుయోధను డొందె నాశమున్
గర్వము ద్రోహమున్ గరపు కర్ణుని మైత్రికి బద్ధుడై కటా
దుర్విన యంబునన్ మనసు దోచెడి వారు హితైషులే కదా. 





No comments: