padyam-hrudyam

kavitvam

Sunday, July 8, 2018

నుతులు

ఆహ్వానం
పుస్తకావిష్కరణ సభ
కంది శంకరయ్య సగర్వంగా సమర్పించు
జడ కందములు – మా కందములు
116 కవుల పద్య సంకలనం
ఆవిష్కర్త : శ్రీ ముద్దు రాజయ్య అవధాని గారు
సమీక్షకులు : ప్రముఖ కవులు శ్రీ నారుమంచి అనంతకృష్ణ గారు
---oOo---
తిరుప్పావై గజల్ మాలిక
రచయిత్రి : డాఉమాదేవి జంధ్యాల
ఆవిష్కర్త : గజల్ కవులు శ్రీ టి.వి.యస్రామకృష్ణ ఆచార్యులు గారు
సమీక్షకులు : ప్రముఖ కవులు శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు
---oOo---
వేదిక : వడ్డేపల్లి కమలమ్మ సీనియర్ సిటిజన్స్ భవనం,
పోస్టాఫీసు ప్రక్కనవివేకానంద నగర్కూకట్ పల్లిహైదరాబాదు.
తేదీ : 8 – 7 – 2018 (ఆదివారం)
సమయం : (కచ్చితంగాసా. 4 గంనుండి సా. 6 గంవరకు.
ఆహ్వానించువారు :
శంకరాభరణం ప్రచురణలు & జె.విపబ్లికేషన్స్, హైదరాబాదు.
ఫెడరేషన్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్కూకట్ పల్లి చాప్టర్ వారిసౌజన్యంతో

---------------------------------------------------------------------------------------------------------



అందములు వాణి కీ జడ
కందములు మనోజ్ఞమైన కైతల కివి సం
బంధములు కావ్య వన మా
కందములును తెలుగు తల్లి కచబంధము నౌ.

***

సంధ్యా కాలమునందు గోపికలతో సంరంభమై యుండ స
ద్వంద్యుండౌ హరి యాలకించెను తిరుప్పావై గజల్మాల సౌ
గంధ్యమ్ముం గొనియాడ వక్త,, లడిగెన్ కన్నయ్య వైనమ్ముకై,
"జంధ్యాలాన్వయ రత్న మ య్యుమ కృతిన్ శ్లాఘించుటల్, పాప దౌ
ర్గంధ్యమ్మున్ హరియించు నయ్యది" యనెన్ రాధమ్మ, వింటే? భళీ!


No comments: