padyam-hrudyam

kavitvam

Monday, October 26, 2015

శుష్కప్రియంబులు, శూన్యహస్తంబులు.....

రాజధాని కొఱకు లక్షలు కోట్లగు
ద్రవ్యమిచ్చి వెన్ను తట్టుననుచు
రాయి వేయుడనుచు రాజును పిలువంగ
ముద్దుమాటలాడి ప్రొద్దు బుచ్చె.

ప్యాకేజీ కావలయును
మాకీరాష్ట్రాభివృద్ధి మాటగ నన్నన్
మీకేయని సుందరమగు
ప్యాకింగున మన్ను, నీరు బహుమతినిచ్చెన్.

శుష్కప్రియంబులు, శూన్యహస్తంబులు
.........వేదన తీర్చునా వెగటుకాక
ఎన్నికలప్పుడు మన్నికౌ మాటలు
.........నేరుదాటిన నావ భార మకట
ప్రత్యర్థినోడింప ప్యాకేజిలక్కడ
.........చేయిచాచినచోట మాయమాట
కానివారలకేమొ కంచాలు పైడివి
.........అయినవారల కిట నాకుముక్క

నేత మాత్రమే మారును నీటుగాను
రాజకీయాల బురఖాకు రాదు మార్పు
పాత్ర మాత్రమే మారును పనికిరాని
పాత ద్రవ్యమే అందుండు ప్రజలు! కనుడు.

No comments: