padyam-hrudyam

kavitvam

Wednesday, October 14, 2020

శోభానాయుడుకు నివాళి

 




ఆంధ్రసత్యభామ యలుకలు మాసెను

శ్రీనివాసపద్మ జేరె విభుని

తెనుగు నాట్య తార దివికి నేగిన వేళ

శోభ లారె నృత్య ప్రాభవమున.


శోభానాయుడు రాకను

శోభలు మితిమీరి వెలిగె సుర నాట్య సభన్

శోభా విహీనులై తమ

ప్రాభవ మడగునని యచ్చరలు దిగులు పడన్.

-దువ్వూరి

No comments: