padyam-hrudyam

kavitvam

Wednesday, May 8, 2013

సరసాహ్లాదిని - దత్తపది

కంది - పెసర - సెనగ - మినుము
పై పదాలను ఉపయోగిస్తూ  నచ్చిన ఛందస్సులో
పార్వతీకళ్యాణము గురించి పద్యం వ్రాయాలి.


నా పద్యం:
 
సిగ్గుతో కందిన చెలి బుగ్గలను జూచి
...................చిరునవ్వు చిందించె శివుని మోము!
ఈశుని నవ్వులింపెసరగ తనపైన
..................తిలకించి పులకించె లలన గిరిజ!
సన్నముత్తియపు సేసల దీసె నగజాత
..................తలవంచె శంభుడు నెలత ముందు!
మినుముట్టె మంగళ ధ్వనులు తాళిని గట్ట
.................సర్వ మంగళ మెడన్ శర్వు డపుడు!

తల్లిదండ్రుల పెళ్లి సంతతి ఘటించి
తనువులెల్లను కన్నులై తరచి చూచె!
శుభ శకునములు పొడసూపె సురుల కంత!
తారకుని రాతి గుండెలో దడ జనించె!

No comments: