పద్యము తెలుగుల స్వంతము హృద్యము చదువరుల కెన్న, నింపగు వినగా పద్యము కవితల కాద్యము సద్యశమును కల్గజేయు చక్కగ కవికిన్.
పితరులు వత్తు రీ దినము పృథ్వికి సంక్రమణంపు వేళ సం
తతి గని మోదమై తనిసి తద్దయు దీవన లీయ, వారికై
హితముగ తర్పణాదికము లిచ్చి మముం గను డంచు శ్రద్ధతో
నతు లిడ నట్టి వారల కనంత శుభంబులు గూడు సర్వదా.
Post a Comment
No comments:
Post a Comment